దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 15వ తేదీన సమావేశం కానున్నారు. అలాగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, లెఫ్టెనెంట్ గవర్నర్లు కూడా హాజరవుతారు. వీరందరూ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు.
అదేవిధంగా ప్రధానిగా రెండోసారి ప్రమాణం చేసిన తర్వాత మోడీ తొలిసారి ఈ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి... ఆ స్థానంలో నీతి ఆయోగ్ను తెచ్చారు మోడీ. ఈ సంస్థకు ఛైర్మన్ ప్రధానమంత్రే అన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ నాలుగు సార్లు భేటీ అయింది. అయిదోసారి ఈనెల 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ కాబోతుంది