కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం రేపింది. గత ఏడాది 17 మందిని బలిగొన్న నిఫా జాడలు మళ్లీ కనిపించడంతో కేరళ వణికిపోతోంది. తాజాగా కొచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి ఈ వైరస్ సోకిందని వైద్యులు గుర్తించారు.నిఫా లక్షణాలు కనిపించడంతో ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. రక్త నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు డాక్టర్లు. ఇక నిఫా కలకలంతో కేరళ సర్కార్ అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడతున్నామని తెలిపారు ఆ రాష్ర్ట సీఎం పినరాయి విజయన్.