భారతీయ వాయుసేనకు చెందిన ఏఎన్-32 ఆంటనోవ్ విమానం ఈరోజు మధ్యాహ్నం గల్లంతయింది. అసోంలోని జోర్హట్ లోని వైమానిక స్థావరం నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని మెచుకా అనే మరో విమానస్థావరానికి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన అరగంటకే విమానంతో సంబందాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన వాయుసేన అధికారులు హెలికాప్టర్లతో, ఒక సుకోయ్-30 యుద్దవిమానంతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కానీ ఇంతవరకు విమానం ఆచూకీ లభించలేదు. రష్యన్ తయారీ ఏఎన్-32 ఆంటనోవ్ విమానంలో విమాన సిబ్బందితో పాటు మొత్తం 13మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.