మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఐఏఎస్ అధికారిణి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదం అవుతోంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న నిధి చౌదరి అనే ఐఏఎస్ అధికారిణి ఈ నిర్వాకానికి పాల్పడి చిక్కుల్లో పడింది. ఆమె చేసిన పోస్ట్ వివాదం కావడంతో వెంటనే స్పందించి ఆ ట్వీట్ను డిలీట్ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తానేదో వ్యంగ్యంగా పోస్ట్ చేశానని, దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చింది.
నిధి చౌదరి పోస్ట్పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. గాడ్సేను ప్రశంసించి గాంధీని అవమానించడం బీజేపీ నేతలకు అలవాటైందని, ఇటీవల బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఆ పనిచేశారని, ఇప్పుడు నిధి వారికి జత కలిశారని సూర్జేవాలా మండిపడ్డారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.