బీజేపీ, తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఉన్నావో MP సాక్షి మహరాజ్…పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ అంటే తప్పేంటని, అలా అన్న వారిపై దీదీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతేకాదు ఆమె రాక్షస వంశానికి చెందిన హిరణ్య కశ్యపుని కుటుంబానికి చెందిన వారని సాక్షి మహరాజ్ ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలతో బీజేపీ, తృణమూల్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగుతోంది. ఇటీవల దీదీ వెళ్తున్న కాన్వాయ్ కి కొంతమంది బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. అంతటితో ఆగకుండా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కారు దిగి వారిని హెచ్చరించారు.