మే 30న జరిగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి ‘బిమ్స్టెక్’ దేశాధినేతలకు పిలిపునిచ్చారు. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మాత్రం ఆహ్వానం పంపలేదు. బిమ్స్టెక్ కూటమిలో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు కలిసి ‘బంగాళాఖాత బహుళరంగ సాంకేతిక, ఆర్థిక సహకార ప్రారంభం’గా ఈ దేశాలను పిలుచుకుంటారు. అయితే మోడీ ప్రమాణస్వీకారానికి దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు మాత్రం ఆహ్వానం వెళ్లలేదు.పాక్తో భారత సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే దానికి ఇది ఓ సంకేతమని పలువురు అంటున్నారు. 2014లో తొలిసారి ప్రధాని పదవి చేపట్టినప్పుడు మోదీ సార్క్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇప్పుడు పాక్పై భారత వైఖరిలో చాలా మార్పు వచ్చింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆపేంతవరకూ ఆ దేశంతో చర్చల ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. అయితే మోడీ ఆహ్వానం అందకపోవడంపై పాక్ తేలిగ్గా కొట్టిపారేసింది. ఆ అంశం అంత ప్రాధాన్యమైంది కాదని వ్యాఖ్యానించింది. అంతర్గత రాజకీయాల కారణంగానే తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆహ్వానించలేదని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ అన్నారు. బిమ్స్టెక్ దేశాలను మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ గ్రూపులో పాకిస్థాన్ సభ్య దేశం కాదు.