కొలంబో: శ్రీలంకలోని కొలంబోలో పోయిన నెల ఈస్టర్ పర్వదినాన వరుస బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల అనంతరం శ్రీలంక ప్రభుత్వం అన్ని విధాల అప్రమత్తంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను నిషేధించడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. దాడుల తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా నెట్వర్క్లపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ప్రపంచమంతా క్రమంగా ఈ నినాదం బలపడుతోంది. అయితే ఆంక్షలను ఆన్లైన్ స్వేచ్ఛపై ప్రమాదకర దాడులుగా కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు సమర్ధిస్తున్నారు.