ఇండియన్ ఆర్మీలోకి మరొక కొత్త గన్ ఎంట్రీ ఇచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ధనుష్ ఆర్టిల్లరీ గన్ ను భారత సైన్యంలో ప్రవేశపెట్టారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ధనుష్ యుద్ధ తుపాకీని ఆవిష్కరించారు. అన్ని రకాల పరిస్థితుల్లో ఈ యుద్ధ తుపాకీని వినియోగించే అవకాశముంటుందని అధికారులు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా రూపొందించినా దీన్ని దేశీ బోఫోర్స్ గా పిలువనున్నారు. బోఫోర్స్ హోవిట్జర్ నమోనా తరహాలో.. ధనుష్ గన్ ను రూపొందించారు.