న్యూఢిల్లీ, ఆగస్ట్ 13: ఉగ్రవాద ప్రేరేపిత ముష్కరులు సాంకేతికత తెలిసిన యువతపైనే దృష్టిసారించారు. గత రెండు ఏళ్ళ కంటే ఈ ఏడాది ఉగ్రవాదం వైపు వెళ్లిన యువత సంఖ్య అధికంగా ఉంది. ఈ ఏడాది గడచిన ఏడు నెలల్లోనే ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అయిన వారి సంఖ్య 70కి చేరింది. 2016 సంవత్సరంలో ఉగ్రవాదులుగా మారిన వారు 88 మందే. 2015లో 66, 2014లో 53 మంది ఉగ్రవాదం బాట పట్టినట్టు భద్రతా బలగాల నివేదికలు వెల్లడిస్తున్నాయి. పుల్వామా, షోఫియాన్, కుల్గామ్ జిల్లాల నుంచే ఎక్కువ శాతం యువత ఈ ఏడాది ఆకర్షించబడినట్లు తెలుస్తుంది.