న్యూఢిల్లీ, మార్చ్ 26: ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజమైన అమెజాన్ మరో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఆన్లైన్ మార్కెటింగ్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని మాల్స్లో 100 అమెజాన్ కియోస్కీలను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఆ మాల్స్లో అమెజాన్కు చెందిన కిండ్లె ఈబుక్ రీడర్, ది ఎకో స్పీకర్, ఫైర్ టివి డోంగల్ వంటివి విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ మాల్స్లో వాడదామనుకుంటున్న కియోస్కీలను రెండేళ్ల క్రితమే బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ల్లో అమెజాన్ నెలకొల్పింది. గత వారమే నోయిడాలోని లాజిక్స్ మాల్లో ఐదో కియోస్కీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమెజాన్ కియోస్కీకి దాదాపు 70-80 చదరపు అడుగుల స్థలం అవసరమవుతోంది. భవిష్యత్తును మనం అంచనా వేయలేం.