న్యూఢిల్లీ, మార్చ్ 16: భారతీయ స్టేట్ బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఖాతాదారులకు ఓ శుభవార్త చెప్పింది. ఎస్బీఐ డిజిటల్ ప్లాట్ఫాం యోనోపై కొత్తగా ‘యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా 16,500కు పైగా ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి సదుపాయాన్ని దేశంలో ప్రవేశపెట్టిన తొలి బ్యాంకుగా ఎస్బీఐ అవతరించింది. యోనో క్యాష్ సదుపాయం ఉన్న ఏటీఎంలను ‘యోనో క్యాష్ పాయింట్’గా వ్యవహరించనున్నారు. వినియోగదారులు ఈ యోనో క్యాష్ పాయింట్లోకి వెళ్లిన తర్వాత కార్డు రహిత విత్డ్రాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరు అంకెల యోనో క్యాష్ పిన్సెట్ చేసుకోవాలి. అనంతరం ఖాతాదారుడి మొబైల్కు ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ నంబరును ఎంటర్ చేయడం ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పని 30 నిమిషాల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.