వరంగల్, మార్చ్ 07: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హసన్పర్తి నుంచి బైక్ ర్యాలీతో వరగంల్లోని ఓసిటీ మైదానంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి బయల్దేరారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కరీంనగర్ నుంచి వరంగల్ వచ్చే మార్గంలో హుజూరాబాద్, హసన్పర్తిలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు.