అమరావతి, మార్చి 2: ఇటీవల సినీ నటి రేణు దేశాయ్ సాక్షి టివీలో యాంకర్ గా చేరి అభిమానులందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే తను జనసేన పార్టీలో చేరబోతుందన్న వార్తలపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. జనసేనే కాదు, తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని ఆమె స్పష్టం చేశారు. జనసేనలో చేరబోతున్నారా? అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నకు ఆమె అసహనం వ్యక్తం చేశారు.
తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉంటే, అందులో సీక్రెట్ ఉండదని తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా లేనని పేర్కొన్నారు. ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. రైతుల సమస్యలపైనే తాను ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించానని తెలిపారు. తాను విజయవాడ, వైజాగ్ పర్యటనలు ముగిసిన తర్వాత హైదరాబాద్ వస్తానని అన్నారు.