అమరావతి, ఫిబ్రవరి 11: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 7 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
ఎపి ఎస్ఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ - 2019
సమయం : ఉదయం గం.9.30ల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు
1. తేదీ:18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
2. తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
3. తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
4. తేదీ: 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1
5. తేదీ: 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2
6. తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1
7. తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2
8. తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1
9. తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2
10. తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1
11. తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2