కత్తులతో దాడిచేసుకున్న రజనీ, అజిత్ ఫాన్స్..

SMTV Desk 2019-01-10 16:24:51  Rajinikanth, Petta, ajith, viswsam, fans war

చెన్నై, జనవరి 10: ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట , తలా అజిత్ నటించిన విశ్వాసం భారీ ఎత్తున విడుదల కాగా, తమిళనాడులోని వేలూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు చిత్రాలు పక్కపక్క థియేటర్లలో ఆడుతుండటంతో, భారీగా తరలివచ్చిన రజనీకాంత్, అజిత్ అభిమానుల మధ్య గొడవ పడ్డారు. మొదట వాగ్వాదంతో ప్రారంభమైన ఘర్షణ, ఆపై కత్తులతో దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది.



ఈ ఘటనలో అభిమానులు వొకరిపై వొకరు దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అవగా, ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అభిమానులను చెదరగొట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరోవైపు మధురై ప్రాంతంలోనూ అభిమానుల మధ్య గొడవ జరిగింది. చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్ లో విశ్వాసం కన్నా ముందు పేట ప్రారంభం కావడంతో అజిత్ అభిమానులు వీరంగం సృష్టించారు.