న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: రిలయన్స్ జియో అత్యధిక వేగంతో 4జీ సేవలందిస్తూ టెలికం సంస్థల్లో మరో సారి టాప్ స్పాట్లో నిలిచింది. తాజాగా టెలికం నియంత్రణ మండలి (ట్రాయ్) విడుదల డేటా ప్రకారం జియో డేటా దూకుడు కొనసాగుతోంది. అయితే గత నెలలో నెట్వర్క్ పనితీరు కాస్త తగ్గినప్పటికీ 4 జీ స్పీడ్లో మళ్లీ టాప్ స్పాట్ దక్కించుకుంది. నవంబర్లో నెలలో జియో స్పీడ్ 20.3 మెగాబిట్ పర్ సెకన్గా ఉంటే... ఎయిర్టెల్ 9.7 ఎంబీపీఎస్గా, వొడాఫోన్ 6.6 ఎంబీపీఎస్గా, ఐడియా 6.2గా ఉందని ట్రాయ్ వెల్లడించింది. అంటే 4జీ స్పీడులో జీయో టాప్ స్పాట్లో ఉంటే... ఐడియా అట్టడుగులో ఉంది