పూణే, అక్టోబర్ 27: భారత్-విండీస్ తో జరుగుతున్న 5 వన్డేలో బాగంగా ఈ రోజు మూడో వన్డే పూణే లో జరుగుతుంది. మూడో వన్డే లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ని ఎంచుకుంది. గత మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన భారత్ అప్పుడు బ్యాటింగ్ ని ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్లో 1-0 ఆధిక్యంతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లోనూ గెలిచి తేడాను మరింత పెంచాలని భావిస్తుండగా, విండీస్ మాత్రం సిరీస్ను సమం చేయాలని చూస్తోంది.
గత రెండు మ్యాచుల్లో తొలి వన్డేలో భారత్ ఘన విజయాన్ని సాధించగా రెండో వన్డేలో డ్రా గా నిలిచింది. అయితే ఆ మ్యాచ్ డ్రా అవ్వడంతో విండీస్ ఊపిరి పీల్చుకుంది. భారత్ జట్టు జరిగిన రెండు మ్యాచ్చుల్లో బౌలింగ్ వో మాదిరిగా ఉన్నందువల్ల ఇప్పుడు జట్టులోకి భువనేశ్వర్, బూమ్రాను తీసుకున్నారు.