జైపూర్ పాంథర్స్ పై విజృభించిన పాట్నా పైరేట్స్

SMTV Desk 2018-10-27 11:34:52  pro kabaddi league, jaipur pink panthers, patna pairets, annop lumar, pradeep

హైదరాబాద్, అక్టోబర్ 27: శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ లో మూడో విఅజయాన్ని సొంతం చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ పాట్నా పైరేట్స్. జైపూర్ పింక్ పాంథర్స్ తో జరిగిన ఈ మ్యాచ్ చాలా హోరాహోరి గా జరిగింది. చివరివరకు ఇరు జట్ల వారు నిలకడ కోల్పోకుండా ఆడారు. పాట్నా పైరేట్స్ తమ సొంత గడ్డ పై చెలరేగిపోయింది. పాట్నా పైరేట్స్ కాస్త వెనుకంజలో వుండి, జైపూర్ పింక్ పాంథర్స్ 2-3 తో ముందుకు సాగాగా అదే సమయంలో పైరేట్స్ కెప్టన్ ప్రదీప్ తన చాకచఖ్యంతో తమ జట్టుని ఆధిక్యంలోకి తీసుకెళ్ళి జట్టుని గెలిపించాడు.





అలాగే దీపక్ హుడా కూడా తన చురుకుదనంతో ఆడగా పాట్నా 20-14తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఈ విధంగా తొలి అర్ధభాగం ముగేసేవరకు పైరేట్స్ 22-15 తో మ్యాచ్ పై పట్టు సాదించింది. కాగా 30 వ నిమిషంలో పాట్నా, పింక్ పాంథర్స్ ని ఆలౌట్ చేయడం ద్వారా 33-21 తో విజయానికి దగ్గరయింది. అదే క్రమంలో అనూప్ సూపెర్ రైడ్ కి మంజీత్ పట్టు వోదలకుండా ఆడి పాట్నాని 41-30 తో విజయాన్ని అందుకున్నారు. కాగా ఈ నేపథ్యంలో అనూప్ కుమార్‌ కెరీర్‌లో 500 రైడ్‌ పాయింట్ల మార్కును అందుకున్నాడు.