టీంఇండియా, అక్టోబర్ 25: విండీస్ తో జరగబోయే మిగితా మూడు వన్డేలకు 15 మంది కలిగివున్న భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొదటి రెండు వన్డే లకు దూరమైనా పేస్ బౌలర్లు భువనేశ్వర్కుమార్, జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్లోకి వచ్చారు. గౌహతి వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు.. విశాఖపట్నం వేదికగా నిన్న రాత్రి ముగిసిన రెండో వన్డేని టైగా ముగించిన విషయం తెలిసిందే.
భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే .