విజయవాడ, జనవరి 18 : విజయవాడలో మొగల్ రాజ్పూరం పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో స్థానికులు క్షేత్రగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కారు నడిపిన కృష్ణా తేజ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కారులో ఎమ్మెల్యే జలీల్ఖాన్ కుమారుడు సాహుల్ఖాన్ ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, పోలీసులు సాహుల్ఖాన్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.