న్యూఢిల్లీ, డిసెంబర్ 22: గ్రామాల సమగ్ర అభివృద్ధి ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో చోటు సంపాదించుకుంది. గ్రామాల్లో మౌలిక వసతులు, ఆర్థిక ప్రమాణాలు, పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలు, మహిళా సాధికారత తదితర అంశాల ఆధారంగా వీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు 83 గ్రామాలకు మిషన్ అంత్యోదయ ర్యాంకులు ఇవ్వగా.. వాటిలో అత్యధికంగా 33 గ్రామాలతో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తమ పది గ్రామ పంచాయతీల్లో ఏడు ఏపీకే దక్కడం మరో విశేషం.