విశాఖపట్టణం, డిసెంబర్ 22: రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఉత్తర కోస్తా వైపు ఉత్తరం నుంచి వాయవ్య దిశగా చల్లటి గాలులు విస్తుండడం వల్ల విశాఖలో సాధారణం కన్నా 4-5 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గురువారం రాత్రి బాపట్ల, చిత్తూరు జిల్లా ఆరోగ్యవరంలో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో కనిష్ఠంగా 14 నుంచి 15 డిగ్రీల సెల్సియస్, కోస్తాలో 14 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.