వాషింగ్టన్, నవంబర్ 03 : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం 60 దేశాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చికాగోలో జరిగిన ఒబామా ఫౌండేషన్ సమావేశంలో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న అనుచరులు ఆయనతో కలిసి సెల్ఫీ దిగాలనుకున్నారు. కానీ ఇందుకు ఒబామా ఒప్పుకోలేదు. అందుకు కారణం ఏంటో కూడా ఒబామా తెలియజేశారు. నేను అధ్యక్షుడిని అయినప్పుడు ప్రజలు నేరుగా నా కళ్లలోకి చూడలేదు. నాకు షేక్హ్యాండ్ కూడా ఇవ్వలేదు. నా వద్దకు వచ్చే ముందు సెల్ఫీ స్టిక్లతో వచ్చారు. ఇప్పటికీ అంతే. నేను స్కూల్లో చదివేటప్పుడు దిగిన ఫొటోలు నా వద్ద ఉండి ఉంటే నేను అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదేమో అలా అని నేను సోషల్మీడియా గురించి తప్పుగా మాట్లాడటం లేదు. కానీ ఓ వ్యక్తి మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం సోషల్మీడియాలో బిజీగా ఉంటూ ఫొటోలు తీసుకుంటూ కూర్చుంటే ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయని చెప్పుకొచ్చారు.