దక్షిణకొరియా, సెప్టెంబర్, 05 : ఎవరిని లెక్క చేయకుండా వరుసగా అణ్వాయుధ పరీక్షలు చేపడుతున్న ఉత్తరకొరియా దుందుడుకు చర్యలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ముప్పుగా వాటిల్లిందని ఐఏఈఏ అధినేత యుకిహ అమానో తెలిపారు. ఆ దేశ చర్యలు గతంలో ప్రాంతీయ సవాలుగానే ఉండేవని, కానీ ఇప్పుడు అణ్వాయుధాలు, క్షిపణులు కలిగిన ప్రపంచ ముప్పుగా మారాయని వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించడంతో దక్షిణకొరియా తమ దేశానికి ఎటువంటి ముప్పు సంభవించకుండా తగిన జాగ్రత్తలను చేపట్టనుంది.