చైనా కంపెనీ ఒప్పో తన ఏ సిరీస్లోని ఒప్పొ ఏ1కే , ఒప్పొ ఏ5ఏస్ స్మార్ట్ఫోన్స్ ధరలో కోత విధించింది. ఒప్పొ ఏ1కే ఫోన్ ఇప్పుడు రూ.7,990కు అందుబాటులో ఉంది. ఇదివరకు దీని ధర రూ.8,490గా ఉంది. ఇక ఒప్పొ ఏ5ఎస్ ఫోన్ను ఇప్పుడు రూ.8,990కు కొనుగోలు చేయవచ్చు. దీని ధర ఇంతకుముందు రూ.9,990గా ఉంది. 3 జీబీ ర్యామ్ వేరియంట్కు ఇది వర్తిస్తుంది. ఒప్పొ ఏ1కే, ఒప్పొ ఏ5ఎస్ స్మార్ట్ఫోన్స్ ధర తగ్గింపు ఇప్పటికే కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్పై ఈ రెండు ఫోన్లను తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.