ఏపీ కొత్త మంత్రులు ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వీరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో తన కేబినెట్ ను ఉద్దేశించిన జగన్ ట్వీట్ చేశారు. కొత్త కేబినెట్ సభ్యులకు హార్థిక శుభాకాంక్షలు. మనం వేసే ప్రతి అడుగు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసమే. మన పని తీరుతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుదాం. ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.