డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్

SMTV Desk 2019-06-06 12:03:17  heart attack, police

రంజాన్ పర్వదినాన నిజామాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా కీళ్ల చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న పుల్లూరి ఆనంద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ చనిపోయాడు. డ్యూటీలో ఉండగానే ఒక్కసారిగా ఆనంద్ కుప్పకూలిపోయాడు. దీంతో దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..మార్గ మధ్యలోనే చనిపోయాడు. ఆనంద్ మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆస్పత్రికి వచ్చిన నిజామాబాద్ సీపీ కార్తికేయ ఆనంద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

2000 లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన ఆనంద్ కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు.