వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఓ మహిళకు అమెరికా న్యాయస్థానం 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అ మహిళా తన సవతి కూతుర్ని చంపినందుకు గానూ ఈ శిక్షను విధించారు. 55 ఏళ్ల షామ్దాయి అర్జున్ అనే మహిళ తొమ్మిదేళ్ల సవతి కూతుర్ని హతమార్చింది. సెకండ్ డిగ్రీ కింద కేసు నమోదు చేశారు. క్వీన్స్లోని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కెన్నెత్ హోల్డర్ ఈ కేసులో తీర్పునిచ్చారు. అర్జున్కు 22 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తున్నట్లు జస్టిస్ హోల్డర్ తెలిపారు.