తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజులగా ఉపవాసం పాటించిన ముస్లింలు మంగళవారం రాత్రి నెలవంక దర్శనంతో ఉపవాసాలు విరమించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మసీదులు, ఈద్గాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అంతా సంతోషంగా ఒక చోటుకు వచ్చి ఈద్-ఉల్-ఫితర్ జరపుకొంటున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ముబారక్ తెలుపుకొంటున్నారు.
ఈ వేడుకలు హైదరాబాద్ నగరంలోని మక్కా మసీదు, మీర్ ఆలం దర్గా, యూసఫ్గూడలోని ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. నెలరోజుల పాటు చేసే ఉపవాస దీక్ష చాలా గొప్పదన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సీపీ తెలిపారు.