అమెరికాలోని ఓ సరస్సులో విశాఖ యువకుడు గల్లంతయ్యాడు. ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన అవినాష్ అమెరికాలోని ఓ సరస్సులో గల్లంతయ్యాడు. అవినాష్ విశాఖలోని స్టీల్ ప్లాంట్ టౌన్షిప్కు చెందిన ఎ.వెంకటరావు కుమారుడు.
ఉన్నత చదువుల కోసం ఐదు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన అవినాష్… ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. వారాంతం కావడంతో రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్ళాడు. సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్ గల్లంతయ్యాడని స్థానిక అధికారులు చెబుతున్నారు. అవినాష్ స్నేహితులు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో విషాదం నెలకొంది.