తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లో తీవ్ర ఆలస్యం జరిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు వీటిని విడుదల చేస్తారు.