న్యూఢిల్లీ: ఆడి ఇండియా ఎ3 సెడాన్పై భారీగా ధరలు తగ్గించింది. ఆడి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎ3 సెడాన్పై రూ.5 లక్షల తగ్గింపు ప్రకటన చేసింది. ఆడి ఎ3 35 టిఎఫ్ఎస్ఐ ధర రూ.28.99 లక్షలు, ఎ3 35 టిడిఐ ప్రీమియం ధర రూ.34.93 లక్షలుగా ఉంది. వేరియంట్ ఆధారంగా తగ్గింపును అందిస్తోంది. కార్లలో ఇప్పటికే ఉన్న ఏ ఫీచర్ను తొలగించలేదని, ఎ3లో మొత్తం 35 టిఎఫ్ఎస్ఐ ప్రీమియం ప్లస్, 35 టిఎఫ్ఎస్ఐ టెక్నాలజీ, 35 టిడిఐ ప్రీమియం ప్లస్, 35 టిడిఐ టెక్నాలజీ ఉన్నాయి.