భారత ప్రధానిగా రెండోసారి భాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తన అఖండ విజయం సందర్భంగా దేశ యువతకు ఫ్రీగా ల్యాప్స్టాప్స్ అందిస్తున్నారు అని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత ల్యాప్టాప్ స్కీమ్ను ప్రకటించారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ఆవిష్కరించారు’ అని వాట్సాప్లలో మెసేజ్లు, సోషల్ మీడియా ప్లాట్పామ్స్పై లింక్లు షేరు అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఇది ఫేక్ న్యూస్. వాట్సాప్, సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో వచ్చే మెసేజ్లలో లింక్ కూడా ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మీరు మోసపూరిత వెబ్సైట్స్ ఓపెన్ అవుతుంది. వీటిల్లో మోదీ అఖండ విజయం సాధించినందుకు 2 కోట్ల మంది యువతకు ఉచితంగా ల్యాప్టాప్స్ లభిస్తాయి అనే సమాచారం ఉంటుంది. పేరు, మొబైల్ నెంబర్ వంటి వివరాలు కూడా అడుగుతుంది. దయచేసి మీ డేటాను వారికి ఇవ్వొద్దు. మోసపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా ఉచిత ల్యాప్టాప్ విషయాన్ని నమ్మవద్దని తెలియజేసింది. ఇకపోతే ఈ అంశంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కారణమైన రాజస్తాన్కు చెందిన నాగౌర్కు చెందిన రాకేశ్ జన్గిద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను 2019 బ్యాచ్కు చెందిన ఐఐటీ కాన్సూర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. వెబ్ అడ్వర్టైజింగ్ ఆదాయం కోసం తన అన్నతో కలిసి ఈ వెబ్సైట్ను క్రియేట్ చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.