స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. నల్గొండలో టీఆర్ఎస్ విజయం సాధించింది. సోమవారం ఉదయం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి లక్ష్మీపై టీఆర్ఎస్ అభ్యర్ధి చిన్నపరెడ్డి విజయం సాధించారు. చిన్నపరెడ్డికి 6వందల ఓట్లు పడ్డాయి. కోమటిరెడ్డి లక్ష్మికి 301 ఓట్లు వచ్చాయి.
ఉమ్మడి నల్గొండలో మొత్తం 1086 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. ఇక వరంగల్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (850) విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంగాల వెంకట్రామిరెడ్డి(23)పై ఆయన 827 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక రంగారెడ్డి స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ తరఫున కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.