బెల్లంపల్లి కల్వరి చర్చిలో రోగాలు నయం చేస్తారని నమ్మి వచ్చిన రాజేష్ను పాస్టర్ ప్రవీణ్ పొట్టన పెట్టుకున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ చేస్తున్న అరాచకాలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. పాస్టర్ ప్రవీణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రార్థనలు చేసుకునే పాస్టర్లకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వస్తున్నాయో తేల్చాలన్నారు. మతం పేరుతో విదేశాల నుంచి వచ్చే డబ్బులతో చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేసేందుకు పాస్టర్ ప్రవీణ్ సిద్ధమయ్యారని రాజాసింగ్ ఆరోపించారు. ప్రవీణ్ను అరెస్ట్ చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. పాస్టర్ను అరెస్ట్ చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిం