ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్తో విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్, హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన సవాంగ్, రవీంద్ర.. ఆయనతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు.
అయితే ఏపీ డీజీపీగా సవాంగ్, ఇంటెలెజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియమితులు కానున్నారనే వార్తల వస్తున్న ఈ సమయంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, నూతన అధికారుల ఎంపికపై సవాంగ్, రవీంద్రతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా జగన్ ప్రమాణస్వీకారం తర్వాత గౌతమ్ సవాంగ్, స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం అందుతుంది.