యువ కథానాయకులలో నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. సొంత బ్యానర్లో నర్తనశాల చేసి పరాజయాన్ని చవిచూసిన నాగశౌర్య, కొంత గ్యాప్ తీసుకుని తన బ్యానర్లోనే మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. దర్శకుడిగా రమణ తేజ పరిచయమవుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు.
కొంతసేపటి క్రితం హైదరాబాద్ - మాదాపూర్ లోని వీఎస్ ఎస్ స్క్వేర్ లో ఈ సినిమాను లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా .. దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ నెల 13 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.