మృత్యువు అంచు వెళ్లొస్తే నోట్లో దాదాపు తలపెడితే ఎలా ఉంటుంది. అమ్మో అదే పరిస్థితి మనకు ఎదురైతే.. తలచుకుంటే ఒంట్లో వణుకు పుడుతోంది కదూ. ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురయ్యింది. చావు అంచుల వరకు వెళ్లి.. తృటిలో తప్పించుకున్నాడు. ముంబైలో పట్టాలపై పడిపోయిన ప్రయాణికుడు.. ట్రైయిన్ మీద నుంచి వెళ్లినా బతికాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
గురువారం రాత్రి అంథేరి స్టేషన్లో ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో ట్రైయిన్ స్టేషన్లోకి వచ్చేసింది. వెంటనే గమనించిన ప్రయాణికుడు.. అలాగే పట్టాలపై పడుకున్నాడు. ట్రైయిన్ మీద నుంచి వెళ్లినా.. చిన్న గీత కూడా పడకుండా మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. వెంటనే ప్లాట్ ఫామ్పై ఉన్న ప్రయాణికులు అతడ్ని పైకి లాగారు.