హైదరాబాద్ ఔట్!

SMTV Desk 2019-05-09 18:59:30  ipl 2019, sunrisers hyderabad

వైజాగ్: ఐపీఎల్ 2019 సీజన్లో ప్లేఆఫ్స్ కు ఎంపికైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ఓటమిపాలై టోర్నీ నుండి ఇంటిబాట పట్టింది. నిన్న జరిగిన మ్యాచ్ లో తొలి బ్యాటింగ్‌ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. స్కోర్ 31 పరుగుల వద్ద సాహా(8) ఇషాంత్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం మార్టీన్ గుప్తిల్(36; 19 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్స్), మనీష్‌ పాండే(30; 36 బంతుల్లో, 3 ఫోర్లు) ధీటుగా బ్యాటింగ్ చేశారు. పాండే 30 పరుగులు చేసిన అనంతరం కీమో పాల్ బౌలింగ్ లో రూథర్ పోర్డు కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విలియమ్ సన్ (28; 27 బంతుల్లో, 2 ఫోర్లు) తక్కువ స్కోర్ కే పెవీలియన్ చేరాడు. విజయ్ శంకర్ (25; 11 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు) కాసేపు మెరుపులు మెరిపించి బౌల్ట్ చేతిలో ఔట్ అయ్యాడు. చివర్లో మహ్మద్ నబీ (20; 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్) ధీటుగా బ్యాటింగ్ చేశాడు. దీపక్ హుడా(4), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్ (0), థంపీ(1 నాటౌట్) తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలింగ్ లో కీమో పాల్ 3, ఇషాంత్ శర్మ2, బౌల్ట్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు. లక్ష్య చేధనలో ఢిల్లీ చివరి బంతి వరకు పోరాడి విజయాన్ని సాధించింది. దీంతో రేపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది.