ముంబై: వరుసగా మూడో రోజు కూడా దేశీ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 138 పాయింట్లు నష్టపోయి 11,359 వద్ద, సెన్సెక్స్ 487 పాయింట్లు నష్టపోయి 37,789 వద్ద ముగిశాయి. మీడియారంగం, స్థిరాస్తి, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా నష్టపోయాయి.