శ్రీనివాసరెడ్డి కస్టడీకి కోర్టు అనుమతి

SMTV Desk 2019-05-08 11:40:05  srinivas reddy,

తెలంగాణలో ఇటీవల సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసు నింధితుడు శ్రీనివాస్ రెడ్డిని కోర్డ్ పోలీస్ కస్టడీకి అనుమంతించింది. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో వరుస హత్యలకు పాల్పడ్డ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని పోలీసు కస్టడికి కోర్టు అంగీకరించింది.

అదేవిదంగా శ్రీనివాస్ రెడ్డిని రేపటి నుండి ఈ నెల 13 వరకు 6 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని యాదాద్రి పోలీసులు రేపు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

కాగా శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నల్లగొండ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోర్ట్ శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.