బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో మరోసారి కలకలం

SMTV Desk 2019-05-06 15:03:00  Basara Saraswathi,

చదువుల తల్లి బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో మరోసారి కలకలం రేగింది. ఈసారి ఏకంగా అమ్మవారి కిరీటంలోని రత్నం మాయమైంది ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ విగ్రహం మకుటంలోని వజ్రం కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల నుంచి ఈ వజ్రం కనిపించకపోయినప్పటికీ... అధికారులు, పూజారాలు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు విషయం బయటకు పొక్కడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2006లో అమ్మావారికి కానుకగా సమర్పించిన ఓ కిరాటానిిక ఓ భక్తుడు వజ్రాలు, రత్నాలను పొదిగించారు. వీటిలో ఒక రత్నం ఇప్పుడు మాయమైంది. ఈ విషయంపై అర్చకులు స్పందిస్తూ, పూజలు చేసే సమయంలో ఒక్కోసారి వజ్రం జారిపోతుంటుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు