గత కొన్ని రోజులు నుంచి టీడీపీ, వైసీపీ పార్టీల నేతల మధ్య పెద్ద ఎత్తునే విమర్శల పర్వం వెల్లువెత్తుతోంది.వైసీపీ నుంచి అయితే ఆ పార్టీలో కీలక నేత అయిన విజయసాయి రెడ్డి వారు వీరు అని చూడకూండా అన్ని పార్టీల నేతలను వాయించేస్తున్నారు.అలాగే ఈ మధ్య తిరుమల దేవస్థానం బంగారం విషయంలో టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు వారి పార్టీ శ్రేణుల్లో పెద్ద ధుమారాన్నే రేపింది.దానితో వారు అప్పటి నుంచి వైకాపా శ్రేణులను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వచ్చారు.
తాజాగా టీడీపీకి చెందినటువంటి మంత్రి దేవినేని ఉమా జగన్ ,విజయసాయి రెడ్డిలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టుకు జగన్ మరియు విజయసాయి రెడ్డిలే కావాలని అడ్డుపడ్డారని 2018లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వీరివల్ల 2019కి పూర్తయ్యే స్థితికి చేరుకుందని.వీరు అధికారం చేపట్టడం జరగదని వీరిద్దరూ ఇలా తెలుగుదేశం ,చంద్రబాబు పై ఫలితాలు వచ్చేంత వరకు మాత్రమే కనపడతారని ఇక మళ్ళీ మే 23 తర్వాత ఎక్కడా కూడా కనిపించరని సంచలన వ్యాఖ్యలు చేసారు.