వాషింగ్టన్: అమెరికా విజిటింగ్ విసాలపై మరిన్ని మారుపులు చేసేందుకు అమెరిక దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సన్నాహాలు చేస్తున్నారు. దీని వల్ల ముఖ్యంగా భారాతీయులకు, అలాగే అమ్రికాను సందర్శించే టూరిస్టులకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. విజిటింగ్ వీసాలను అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ అడ్మిషన్ బాండ్స్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి వైట్హౌస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.గత నవంబర్ నాటికే అమెరికాలో మొత్తం 1.96 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. వీరి సంఖ్య అమెరికాలో విద్యనభ్యసిస్తున్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో.. 18 శాతం కావడం విశేషం. కాగా 2013లో యూకే సైతం విజిటింగ్ వీసాలను కట్టడి చేసేందుకు ఇలాంటి సెక్యూరిటీ బాండ్ల విధానాన్నే ప్రవేశపెట్టింది.మొత్తం ఆరు దేశాలకు చెందిన పౌరులు యూకేను సందర్శించాలంటే 3వేల పౌండ్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిబంధన పెట్టింది. అయితే ఎంపిక చేసిన 6 దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రధానంగా అమెరికాకు వచ్చే బిజినెస్, టూరిస్ట్ ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను తగ్గించే దిశగా ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారు.