థాయ్ లాండ్, మార్చ్ 31: పార్క్ లోని బురద కొలనులో చిక్కుకున్న ఆరు ఏనుగుపిల్లలని థాయ్ లాండ్ పోలీసులు రక్షించారు. వివరాల ప్రకారం...థాయ్ లాండ్ లోని ఈస్ట్ బ్యాంకాక్ లో ఉన్న నేషనల్ పార్కులోని నీటితో ఉన్న బురద కొలనులోకి ఆరు ఏనుగు పిల్లలు దిగి ప్రమాద వశాత్తు అందులో ఇరుక్కుపోయాయి. రోజంతా బురదలోనే ఉన్న ఏనుగు పిల్లలు ఎంత ప్రయత్నించినా బయటకు వచ్చేందుకు దారిలేకపోవడంతో రాత్రంతా బురదలోనే ఉన్నాయి. చివరకు పార్కు అధికారులు, థాయ్ లాండ్ పోలీస్ అధికారులు ఏనుగులు బయటకు వచ్చేందుకు చదునుచేయడంతో అవీ బయటకు వచ్చాయి. అయితే వేసవికాలం కావడంతో మంచినీరు దొరకక ఇలాంటి సంఘటనలు జరుతుతాయని అధికారులు తెలిపారు.