ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈసీ ఆదేశాలను అమలు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు హెడ్క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. ఇటీవల రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.