120 కిలోల బంగారం స్వాదీనం చేసుకున్న పోలీసులు

SMTV Desk 2019-03-22 15:35:58  gold, gold transport illegal, uttarpradesh, loksabha elections

లక్నో, మార్చ్ 22: ఉత్తరప్రదేశ్ లోని ఘ‌జియాబాద్ జిల్లాలో శుక్రవారం పోలీసులు నిర్వహించిన తనీఖీలో అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల సందర్భంగా యుపి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ కారులో తరలిస్తున్న 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన ఈ బంగారం విలువ సుమారు 38 కోట్ల రూపాయలు ఉంటుందని వారు చెప్పారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. ఈ బంగారాన్ని ఢిల్లీ నుంచి హరిద్వార్ కు తరలిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.