ఇప్పటికీ అంబాసిడర్ కారును వాడుతున్న ముఖ్యమంత్రి ఈయనే!

SMTV Desk 2019-03-22 12:28:17  naveen patnayak, Ambassidor,

2000 నుంచి వరుసగా నాలుగుసార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న నవీన్ పట్నాయక్ సంపద ఎంతో వివరించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సంధర్భంగా ఎన్నికల సంఘం వద్ద ఆయన తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన సంపద విలువ రూ.63.7 కోట్లు. అందుకు కారణం ఒడిశా, దిల్లీలో ఉన్న ఆస్తుల విలువలో పెరుగుదల నమోదవ్వడమే అంటున్నారు. ఆభరణాలు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌, నగదుతో కలిపి మొత్తం చరాస్తుల విలువ రూ.23 లక్షలు. 2014తో పోల్చుకుంటే రూ.5 లక్షలు అదనంగా పెరిగింది. అలాగే స్థిరాస్తుల విలువ 2014లో రూ.12 కోట్లు కాగా, ఇప్పుడు తాజాగా వెల్లడించి అఫిడవిట్‌లో ఆ మొత్తాన్ని రూ.63 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రూ.25వేలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ 1980 కాలం నాటి రూ.9 వేల అంబాసిడర్ కారునే వాడుతున్నారు.

మరో నెల రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదవసారి ముఖ్యమంత్రిగా గెలవాలని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బిజెపుర్‌, హింజలి ప్రాంతాల నుంచి పోటీ పడుతున్నారాయన. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ బిజు జనతాదళ్ 147 అసెంబ్లీ స్థానాలకు గానూ 117 నియోజకవర్గాల్లో విజయ బావుటా ఎగరేసింది.