హోళీ పండగ సందర్భంగా రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కళ్లు చెదిరే ఆఫర్ను ప్రకటించింది. హోలీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ దగ్గరున్న పాత ఫోన్ ఇచ్చేసి రూ.1,095 చెల్లిస్తే.. జియో కొత్త ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఆఫర్లో రూ.594 విలువైన రీఛార్జ్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. 6 నెలల పాటు అన్లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ పొందొచ్చు. ఫోన్ అసలు ధర రూ.1,500 కాగా, రీఫండబుల్ డిపాజిట్ కింద రూ.501 ధరకే లభిస్తోంది అన్నమాట.
ఈ ఆఫర్ పొందాలనుకునేవారు రిలయెన్స్ జియో వెబ్సైట్ అయిన jio.com ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. లేదా దగ్గర్లో ఉన్న జియో స్టోర్లో ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ వద్దనుకునేవాళ్లు ఈ ఫోన్ మాత్రమే కొనొచ్చు. ఇందుకోసం రూ.1,500 చెల్లించాలి. అది కూడా రీఫండబుల్ డిపాజిట్ కిందే.