బీజింగ్, మార్చ్ 21: ఈ రోజు మధ్యాహ్నం యాంగ్ చెంగ్లోని తాంజాయ్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పేలుడు ధాటికి సమీప భవనాల అద్దాలు పాక్షికంగా ధ్వసమయ్యాయని స్థానికులు వెల్లడించారు.